ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బహిర్భూమికి వెళ్లిన మహిళపై చిరుత దాడి.. తీవ్ర గాయాలు.

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 14, 2024, 06:15 PM

ఆదిలాబాద్‌లో మరోసారి చిరుతపులి విరుచుకుపడింది. ఇటీవలే కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి దాడి చేసి మహిళ ప్రాణాలు తీసిన ఘటన మరువకముందే.. మరో మహిళపై చిరుత దాడి చేయటం ఇప్పుడు సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. శనివారం (డిసెంబర్ 14న) రోజున ఉదయం సమయంలో.. బజార్‌హత్నూర్ మండలం డెడ్రా గ్రామానికి చెందిన భీమాబాయి అనే మహిళ బహిర్భూమికి వెళ్లగా.. ఒక్కసారిగా చిరుత దాడి చేసింది. చిరుత దాడితో బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో.. స్థానికులు పరుగు పరుగున వచ్చి చిరుతను వెళ్లగొట్టి భీమాబాయిని రక్షించారు. వెంటనే.. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.


అయితే.. చిరుత దాడిలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె కంటికి గాయమవటంతో.. తీవ్ర రక్తస్రావం జరిగింది. దీంతో.. భీమాబాయిని హుటాహుటిన ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వెంటనే స్పందించి.. రక్తస్రావాన్ని నిలిపేసి.. చికిత్స చేశారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వైద్య ఖర్చుల కోసం అటవీ శాఖ తక్షణ సహాయాన్ని అందించింది. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నారు. అడవికి సమీపంలో ఉన్న షెడ్డులోని పశువులను చంపేందుకు చిరుత వచ్చి ఉంటుందని అటవీశాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


అయితే.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అడవుల్లో కనీసం 13 చిరుతలు నివాసం ఉంటున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇవి ఎక్కువగా అడవుల్లోనే పశువులను చంపి.. తమ ఆహారాన్ని సమకూర్చుకుంటాయని చెప్తున్నారు. కానీ.. ఇటీవల పులు.. జనావాసాల్లోకి, రహదారులపైకి వస్తూ.. మూగజీవాలతో పాటు మనుషులపై కూడా దాడులు చేస్తుండటం జనాలను భయాందోళనకు గురిచేస్తోంది.


కాగా..నవంబర్ 29వ తేదీన కూడా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం ఈసగావ్ గ్రామంలో పత్తి పంట కోసే పనిలో నిమగ్నమై ఉన్న మోర్లె లక్ష్మి (21) మీద ఓ పులి దాడి చేసింది. ఈ ఘటనలో మహిళ ప్రాణాలు వదిలింది. ఇక.. నవంబర్ 30న సిర్పూర్ (టి) మండలం దుబ్బగూడెం గ్రామంలో రౌతు సురేష్‌ అనే రైతుపై.. కూడా పుటి దాడి చేసింది. అయితే.. వాళ్లిద్దరి మీద దాడి చేసింది ఒకే పులి అని అధికారులు అనుమానిస్తున్నారు. అదే పులి దాడి చేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa