ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లగచర్ల కేసులో కీలక నిందితుడికి బెయిల్‌ మంజూరు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 09, 2025, 03:06 PM

వికారాబాద్ (D) లగచర్ల కేసులో కీలక నిందితుడు సురేశ్‌( ఏ1)కు గురువారం HYD-నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. రూ.50 వేల పూచీకత్తు, షరతులతో కూడిన బెయిల్‌ను న్యాయస్థానం మంజూరు చేసింది. సాక్షులను ప్రభావితం చేయవద్దని సురేశ్‌ను ఆదేశించింది. అయితే ఇప్పటికే 2 సార్లు కస్టడీకి తీసుకొని సురేశ్‌ను పోలీసులు విచారించారు. కాగా, ఫార్మాసిటీ ఏర్పాటు కోసం కొద్ది రోజుల క్రితం లగచర్ల చేరుకున్న కలెక్టర్, అధికారులపై గ్రామస్థులు కర్రలు, రాళ్లతో దాడి చేసిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa