జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలో ఈ ఏడాది మే 15 నుంచి 26 వరకు జరగనున్న సరస్వతీ నది పుష్కరాల ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.ఈ పుష్కరాల కోసం అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ రూ.25 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.పుష్కరాలకు లక్షలాది భక్తులు తరలివచ్చే అవకాశమున్నందున, వారి కోసం స్నాన ఘట్టాల నిర్మాణం, రోడ్ల విస్తరణ, డ్రైనేజీల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని మంత్రి సురేఖ అధికారులకు సూచించారు. ఈ పనులను సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.పుష్కరాల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖకు ధన్యవాదాలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa