ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఘనవిజయం సాధించిన సందర్బంగా జూలపల్లి మండల బిజెపి శ్రేణులు సంబరాలు చేసుకుని టపాసులు పేల్చి,ఒకరికొకరు మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్బంగా మండల అధ్యక్షులు కొప్పుల మహేష్ మాట్లాడుతూ..బిజెపి పార్టీ కి ఇంతటి ఘనవిజయాన్ని అందించి నరేంద్రమోడీ నాయకత్వానికి మరింత బలాన్ని చేకూర్చిన ఢిల్లీ ఓటర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బారతీయ జనతా పార్టీకే ప్రజలు పట్టం కట్టబోతున్నారని అన్ని సర్వేలు ప్రజల గుండెల్లో బిజెపినే ఉన్నదని, నరేంద్రమోదీ నాయకత్వన్నే ఢిల్లీ నుండి గల్లీ వరకు ప్రజలు కోరుకుంటున్నారని వారు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గుడిపాటి సంతోష్ రెడ్డి,గుమ్మడి శంకరయ్య, బూసారపు రవీందర్ గౌడ్, బొజ్జ సంపత్, ఆవుల రాజు, పెసరు మల్లేశం, బొజ్జ రమేష్, మోహన్ రెడ్ది, కూనిరాజుల అజయ్, దాడి లక్ష్మన్, వడ్లకొండ శ్రావణ్, నగునూరి లక్ష్మినారాయణ, చొప్పరి సంతోష్, గుంటి అశోక్, కత్తెర్ల వెంకన్న, కొమ్మ మహేందర్ బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa