ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అవినీతి సర్కారు అంతం సుపరిపాలనకు పట్టం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 09, 2025, 08:22 PM

అవినీతిలో పీకల్లోతు కూరుకుపోయిన ఆప్ పార్టీకి బుద్ధి చెప్పి దేశవ్యాప్తంగా నీతి నిజాయితీతో సుపరిపాలన అందిస్తున్న బిజెపికి ఢిల్లీ ప్రజలు పట్టం కట్టారని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబటి బాలేష్ గౌడ్ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించిన సందర్భంగా మున్సిపల్ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో దుబ్బాకలో బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకొని సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబటి బాలేష్ గౌడ్ మాట్లాడుతూ ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని నమ్మి అధికారాన్ని అప్పగిస్తే పీకల్లోతు అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయి జైలు పాలై, ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో సహా ముఖ్యమైన నాయకులు అందరిని ఓడించి ఆప్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారని, దేశంలో అవినీతి లేని సుపరిపాలన అందిస్తున్న బిజెపికి ఢిల్లీ ప్రజలు పట్టం కట్టారని అన్నారు. ఎన్ని మాయ మాటలు చెప్పినా కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు ఇవ్వకుండా ఢిల్లీ ప్రజలుబుద్ధి చెప్పారని  అన్నారు. 
ప్రజలను నమ్మించి గద్దెనెక్కిన తర్వాత మోసం చేస్తున్న ఏ పార్టీని ప్రజలు వదలరని, రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.అవినీతి మచ్చలేని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బిజెపిని దేశవ్యాప్తంగా ప్రజలు ఆదరిస్తున్నారని అందుకే ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ విజయదుందుభి మోగిస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు సుభాష్ రెడ్డి, మట్ట మల్లారెడ్డి, గాజుల భాస్కర్, సత్తయ్య, గవ్వల రమేష్, రమేష్ రెడ్డి, మోత్కుపల్లి బద్రి, మెరుపుల సాయికుమార్ గౌడ్, నేహాల్ గౌడ్, నిమ్మ యాదగిరి, రమణారెడ్డి, పెంటమ్ కిషన్, మహేష్, నక్క శ్రీనివాస్, బాచి, మనోజ్ గౌడ్, యాదవ రెడ్డి, భరత్ చారి, దోరగొల్ల మహేష్, పుల్లూరి రాజు, శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa