ట్రెండింగ్
Epaper    English    தமிழ்

BIRD FLU ఎఫెక్ట్: భారీగా తగ్గిన చికెన్ అమ్మకాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 13, 2025, 11:13 AM

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విజృంభణతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ వైరస్ వల్ల కోళ్లు చనిపోవడంతో చికెన్ తినడానికి ప్రజలు సంకోచిస్తున్నారు. దాంతో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. హైదరాబాద్‌లో 50 శాతం వరకు అమ్మకాలు తగ్గాయని వ్యాపారులు తెలిపారు. అయితే చికెన్‌ను 70-100 డిగ్రీల సెల్సియస్ వేడిలో చికెన్‌ను ఉడికించి తింటే ఎలాంటి సమస్య ఉండదని అధికారులు చెబుతున్నారు.
వెలవెలబోతున్న చికెన్ సెంటర్లు
కోళ్లకు వైరస్‌ సోకుతుందనే అనే ప్రచారం బాగా జరగడంతో  జనాలు చికెన్‌ తినేందుకు భయపడుతున్నారు.  అంతకుముందు కళకళలాడిన చికెన్ సెంటర్లు ఇప్పుడు ఖాళీగా వెలవెలబోతున్నాయి. ఆదివారం కేజీ రూ.200-220 ఉన్న ధర ఇప్పుడు రూ.150-170 పలుకుతోంది. రేటు తగ్గిన సరే జనాలు మాత్రం చికెన్ కొనడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇక తెలంగాణలో  బర్డ్ ప్లూ వైరస్ ఎఫెక్ట్ పెద్దగా ఏమీ లేనప్పటికీ చికెన్ తినడానికి మాత్రం భయపడుతున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa