ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 03, 2025, 05:05 PM

 రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఇబ్రహీంపట్నం గురునానక్ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో సోమవారం చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మాల్ నుండి హైద్రాబాద్ కు వెళ్తున్న కారు ఇబ్రహీంపట్నం నుండి మాల్ వైపు వెళ్తున్న బైక్ ఎదురెదురుగా వచ్చి ఢీ కొట్టింది. బైక్ నడుపుతున్న జంగయ్య(27) అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందారు. కాగా అతని ఇద్దరు పిల్లలు, భార్య పార్వతమ్మ(26) కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మృతుడు జంగయ్య స్వగ్రామం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని యరగండ్లపల్లి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఇబ్రహీంపట్నం పోలీసులు తెలిపారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa