ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇందిరా శక్తి మిషన్–2025కు ఆమోదం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 07, 2025, 10:43 AM

మహిళా సాధికారతకు పట్టం కడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇందిరా శక్తి మిషన్–2025కు ఆమోదం తెలిపింది. గ్రామాల్లో సెర్ప్ కింద, పట్టణాల్లో మెప్మా కింద ఉన్న మహిళా సంఘాలు ఇక నుంచి ఒకే గొడుగు కిందకు తీసుకు రావాలని కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానించింది. అలాగే మహిళా స్వయం సహాయక సంఘాలలో సభ్యత్వానికి కనీస వయసు 15 నుంచి 65 ఏళ్లకు సవరించింది.దాంతో పాటూ పలు నిర్ణయాలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. 2025 - 2030 మధ్య ఐదేళ్లకు గాను టూరిజం పాలసీకి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో గుర్తించిన 27 ప్రాంతాలను ప్రత్యేక టూరిస్టు కేంద్రాలుగా తీర్చిదిద్దడం.. ఆ ప్రాంతాల అభివృద్ధి చేయడంలో 15 వేల కోట్లకు తగ్గకుండా పెట్టుబడులను రాబట్టేలా పాలసీలను తయారు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి ఆలయ ట్రస్టు బోర్డు ఏర్పాటుకు వీలుగా దేవాదాయ చట్టంలో సవరణలు చేయాలని నిర్ణయించారు. ఇక మే నెలలో జరగబోయే మిస్ వరల్డ్ పోటీలకు 140 దేశాల నుంచి వచ్చే అతిథులకు ఏ లోటూ లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa