తెలంగాణలో రెండో శనివారం, ఆదివారం పేరుతో ఇప్పటికే రెండు రోజులు సెలవులు రాగా.. సోమవారం (ఏప్రిల్ 14న) రోజున కూడా విద్యాసంస్థలు సెలవు ప్రకటించాయి. ఏప్రిల్ 14న డా. బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. దీనితో పాటు.. మరో మూడు రోజుల తర్వాత ఇంకో సెలవు కూడా రానుంది. అంబేద్కర్ జయంతిని జాతీయ సెలవు దినంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో విద్యాసంస్థలకు సెలవు వచ్చింది.
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలు తమ క్యాలెండర్లలో ఏప్రిల్ 14వ తేదీని ప్రభుత్వ సెలవు దినంగా చేర్చాయి. దీంతో పాఠశాలలు, కళాశాలలు సెలవు దినంగా ప్రకటించాయి. స్కూళ్లు, కాలేజీలతో పాటు.. దేశవ్యాప్తంగా బ్యాంకులు, స్టాక్ మార్కెట్లు కూడా సోమవారం పనిచేయవు.
అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, సామాజిక సంస్థలు, విద్యా సంస్థలు ఆయన జీవితం, ఆయన చేసిన కృషి గురించి ప్రజలకు తెలియజేసేందుకు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాయి. సోమవారం (ఏప్రిల్ 14) రోజునే కాదండోయ్.. ఈ నెలలో మరో సెలవు కూడా ఉంది. ఏప్రిల్ 18వ తేదీన గుడ్ ఫ్రైడే సందర్భంగా పాఠశాలలకు సెలవు ఉంటుంది. వరుసగా వస్తున్న సెలవులతో విద్యార్థులకు ఎగిరిగంతేస్తున్నారు. కాగా.. ఇప్పటికే పలు పాఠశాలల్లో పరీక్షలు పూర్తవగా.. ఒంటి పూట బడులు నిర్వహిస్తున్నారు. ఇందులోనూ సెలవులు రావటంతో.. విద్యార్థులు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
ఇదిలా ఉంటే.. తెలంగాణలో పాఠశాలలకు వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుంచే ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 23, 2025 విద్యా సంవత్సరానికి చివరి పనిదినం. చాలా పాఠశాలలు అదే రోజు ఫలితాలను ప్రకటిస్తాయి మరియు తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశాలు కూడా నిర్వహించే అవకాశం ఉంది. మళ్లీ జూన్ 11తో వేసవి సెలవులు పూర్తయి జూన్ 12వ తేదీన పాఠశాలు తిరిగి తెరుచుకోనున్నాయి. అయితే, జూనియర్ కళాశాలలకు మాత్రం మార్చి 31 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయి. జూన్ 2న తిరిగి ప్రారంభమవుతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa