ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిలోఫ‌ర్ ఆస్ప‌త్రిలో దారుణం.. మందుల‌తో ప‌ట్టుబ‌డిన మ‌హిళా సిబ్బంది

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 24, 2025, 07:25 PM

కార్పొరేటు, ప్రైవేటు ఆస్ప‌త్రిలో చేరే స్థోమ‌త లేక‌నే.. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి వ‌స్తారు. గ‌వ‌ర్న‌మెంట్ హ‌స్పిట‌ల్‌కి వ‌చ్చే వారిలో ఎక్కువ మంది.. మ‌ధ్య త‌ర‌గ‌తి, దిగువ మ‌ధ్య త‌ర‌గ‌తి, పేద కుటుంబాల‌కు చెందిన వారే ఉంటారు. కార‌ణం ఉచిత వైద్యం, మందులు కూడా ఫ్రీగానే ఇస్తార‌నే ఉద్దేశంతో. కానీ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో ప‌ని చేసే కొంద‌రికి ఇవేం ప‌ట్ట‌వు. వారి ప‌రిస్థితి గురించి ఏమాత్రం ఆలోచించకుండా డ‌బ్బులు డిమాండ్ చేస్తారు. ఎక్కువ శాతం.. క్లీనింగ్‌, అటెండెంట్ డ్యూటీ చేసే వారు ఇలా వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతుంటారు. ఇచ్చినంత తీసుకోరు.. డిమాండ్ చేస్తారు. డ‌బ్బుల్లేవంటే నానా ర‌చ్చ చేస్తారు. ఇక మ‌రి కొంద‌రు ఓ అడుగు ముందుకు వేసి ఆస్ప‌త్రిలో చేతి వాటం చూపుతూ.. మందులు, ఇంజక్ష‌న్లు, గ్లూకోజు బాటిల్స్‌ను దొంగిలించి.. వాటిని బ‌య‌ట అమ్ముకుంటారు. ఈ కోవ‌కు చెందిన ఘ‌ట‌న ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది.


నిలోఫ‌ర్ ఆస్ప‌త్రికి చెందిన మ‌హిళా సిబ్బంది ద‌గ్గ‌ర‌ ఇంజెక్ష‌న్లు, సిరంజీలు, ఖ‌రీదైన మందులు వెలుగు చూడ‌టం సంచ‌ల‌నంగా మారింది. ఈ సంఘ‌ట‌న బుధ‌వారం నాడు వెలుగులోకి వ‌చ్చింది. నిలోఫ‌ర్ ఆస్ప‌త్రిలో కొన్నాళ్ల పాటు దాయ‌మ్మ‌గా పని చేసిన శాలిని.. ప్ర‌స్తుతం లిఫ్ట్ ఆప‌రేట‌ర్‌గా విధులు నిర్వ‌హిస్తుంది. ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం రాత్రి విధుల‌కు వ‌చ్చే స‌మ‌యంలో రెండు పెద్ద సంచులు తీసుకుని వ‌చ్చింది. ఆమె ప్ర‌వ‌ర్త‌న కాస్త అనుమానాస్ప‌దంగా ఉండ‌టంతో... అక్క‌డ విధులు నిర్వ‌హించే పోలీసులు ఆమె ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఆరా తీశారు. లిఫ్ట్ ఆప‌రేట‌ర్‌కు సంచుల‌తో ఏం ప‌ని అని ప్ర‌శ్నించారు.


త‌న బండారం బ‌య‌ట‌ప‌డుతుంద‌ని భావించిన శాలిని.. రివ‌ర్స్‌లో పోలీసుల మీద‌నే తిర‌గ‌బ‌డింది. వారిపైన అరిచి గోల చేసింది. కానీ పోలీసులు వెన‌క్కి త‌గ్గ‌లేదు. మ‌హిళా సిబ్బందిని పిలిపించి శాలిని వ‌ద్ద ఉన్న సంచ‌ల‌ను చెక్ చేయ‌మ‌ని చెప్పారు. సంచుల‌ను తెరిచి చూసిన వారు ఒక్క‌సారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే సంచుల్లో ఏకంగా మందుల దుకాణ‌మే క‌నిపించింది. రూ.6 వేలు, రూ.7 వేలు ఖ‌రీదు చేసే ఇంజెక్ష‌న్లు, సిరంజీలు, ఖ‌రీదైన మందులు బ‌య‌ట‌ప‌డ్డాయి. మ‌రో సంచిలో డ‌బ్బులు బ‌య‌ట‌ప‌డ్డాయి.


దాంతో పోలీసులు మందులు ఎక్క‌డ‌వ‌ని ప్ర‌శ్నించారు. కోఠి నుంచి వ‌చ్చే స‌మ‌యంలో కొనుక్కుని వ‌చ్చాన‌ని చెప్పింది శాలిని. కానీ అవ‌న్ని అక్క‌డ ఆస్ప‌త్రిలోనివే అని పోలీసులు, వైద్యాధికారులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు రోగులు షాకింగ్ విష‌యాలు వెల్ల‌డించారు. రాత్రి స‌మ‌యాల్లో ఆస్ప‌త్రికి వ‌చ్చే రోగుల‌కు మందులు లేవ‌ని బ‌య‌ట‌కు పంపుతారని చెప్పారు. ఇక ఎమ‌ర్జెన్సీ వెళ‌ల్లో బ‌య‌ట‌కు వెళ్లి వ‌చ్చే స‌రికి లేట్ అవుతుంది. అలాంటి వారిని టార్గెట్ చేసుకుని రెట్టింపు డ‌బ్బులు తీసుకుని మందులు అమ్ముతున్న‌ట్లు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై బుధవారం డ్యూటీ ఆర్ఎంఓ నాంప‌ల్లి పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. శాలిని ద‌గ్గ‌ర దొరికిన మందులు స్వాదీనం చేసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa