ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌కు మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, May 09, 2025, 01:58 PM

హైదరాబాద్ నగరం మళ్లీ ఒక అంతర్జాతీయ ఈవెంట్‌కు వేదికగా మారుతోంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అందాల పోటీ మిస్ వరల్డ్ 2025 కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో నగరం సర్వాంగసుందరంగా ముస్తాబైంది. ఈ పోటీలు శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభంకానున్నాయి.
ఈ మహా ఈవెంట్‌కు హాజరయ్యేందుకు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన మిస్ వరల్డ్ ప్రాతినిధులు నగరానికి చేరుకున్నారు. ఇదిలా ఉంటే, ‘మిస్ వరల్డ్ 2024’ విజేత క్రిస్టినా పిస్కోవా (చెక్ రిపబ్లిక్) శుక్రవారం హైదరాబాద్‌ చేరుకున్నారు. ఆమెకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు.
ఈ పోటీలు కేవలం ఒక అందాల ప్రదర్శన మాత్రమే కాకుండా, మహిళల సామర్థ్యాన్ని, సామాజిక బాధ్యతను ప్రదర్శించే వేదికగా మారాయి. హైదరాబాద్‌లో ఈవెంట్ జరగడం ద్వారా నగరానికి అంతర్జాతీయ ఖ్యాతి దక్కుతుందనే భావన వ్యక్తమవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa