దొంగతనాలు నివారించేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గాంధారి ఎస్ఐ ఆంజనేయులు సూచించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు.
ఆరుబయట నిద్రించకండి. ఊర్లకు వెళ్లేటప్పుడు విలువైన ఆభరణాలు, వస్తువులు ఇంట్లో వదిలిపెట్టవద్దు. తప్పనిసరిగా తాళం వేసే పరిస్థితిలో ఉంటే, ఆ తాళం బయటకు కనిపించకుండా చూడండి. ఇంటి ముందు బట్టలు ఆరవేసి ఉండేలా చూసుకోండి, దీంతో ఇంట్లో ఎవరైనా ఉన్నారన్న భావన దొంగల్లోకి కలుగుతుంది" అని ఎస్ఐ సూచించారు.
అలాగే, ఎవరు ఇంటికి తాళం వేసి ఊర్లకు వెళ్తున్నా, సమీప పోలీసులకు ముందుగా సమాచారం ఇవ్వాలని కోరారు. మరోవైపు, ఓటిపీలను ఎవరితోనూ పంచుకోరాదని హెచ్చరించారు. సైబర్ దోపిడీలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరిస్తేనే చోరీలు, మోసాలను అరికట్టవచ్చని ఎస్ఐ ఆంజనేయులు అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa