వేసవి కాలం సెలవులు.. దానికితోడు ఈ నెలలో చాలా వరకు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు ఉన్నాయి. దీంతో చాలా మంది వెకేషన్స్, బంధువుల ఇళ్లకు వెళ్లడం, ఫంక్షన్స్కు హాజరుకావడం వంటి కార్యక్రమాలతో బిజీగా గడుపుతుంటారు. అయితే దూర ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారు రైలు ప్రయాణానికే ఓటేస్తారు. తక్కువ ఖర్చుతో సౌకర్యవంతంగా ప్రయాణం చేయవచ్చని భావించి.. నెలల ముందుగానే ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటారు. మరి మీరు కూడా ఈ జాబితాలో ఉంటే.. రైల్వేశాఖ మీకోసం కీలక అప్డేట్ విడుదల చేసింది. పలు రైళ్లను రద్దు చేయడమే కాక కొన్నింటి మార్గం మళ్లించింది. మరి ఈ జాబితాలో మీరు వెళ్లాలనుకున్న రూట్ ఉందేమో చూసుకొండి.
రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పలు రైళ్లను రద్దు చేయడమే కాక.. కొన్నింటి మార్గాన్ని మళ్లించింది. అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం.. పలు చోట్ల ట్రాక్ మరమ్మతులు, లోకో షెడ్యూలింగ్, అలాగే మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో జరుగుతున్న మూడో లైన్ పనులు. ఈ నేపథ్యంలోనే రైల్వే శాఖ రైళ్ల రద్దు నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి అనగా మే 23 నుంచి 29 వరకు ఖమ్మం రైల్వేస్టేషన్ మీదుగా వెళ్లే పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
రైల్వే శాఖ నిర్ణయంతో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. రైళ్ల రద్దు నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకుని.. ప్రయాణికులు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది. మరిన్ని వివరాలు కోసం ఖమ్మం రైల్వే స్టేషన్లో సంప్రదించాలని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నేటి నుంచి అనగా మే 23 నుంచి 29 వరకు పలు రైళ్లను రద్దు చేశారు. ఆ వివరాలు..
తెలుగు రాష్ట్రాల మధ్య రద్దైన రైళ్లు..
సికింద్రాబాద్-గుంటూరు (రైలు నం.12706)
సికింద్రాబాద్-విజయవాడ (రైలు నం.12714)
డోర్నకల్-విజయవాడ(రైలు నం.67767)
విజయవాడ-భద్రాచలం రోడ్ (రైలు నం. 67215)
గుంటూరు-సికింద్రాబాద్ (రైలు నం.12705)
విజయవాడ-సికింద్రాబాద్ (రైలు నం.12713)
విజయవాడ-డోర్నకల్ (రైలు నం.67768)
భద్రాచలం రోడ్-విజయవాడ (రైలు నం.67216)
ఇతర రద్దైన రైళ్ల వివరాలు..
ఇండోర్-కొచ్చివెల్లి (రైలు నం.22645) ఈనెల 23న రద్దయ్యింది.
కొచ్చివెల్లి-ఇండోర్ (రైలు నం.22646) 24న
హిస్సార్-తిరుపతి (రైలు నం. 04717) 24న,
గోరఖ్పూర్-కొచ్చివెల్లి (రైలు నం. 12511) ఈ నెల 23,25న
గాంధీధామ్-విశాఖపట్నం (రైలు నం.20804) 25న
తిరువనంతపురం-కోర్బా (రైలు నం. 22648) 26న,
తిరుపతి-హిస్సార్ (రైలు నం.04718) 26న,
సికింద్రాబాద్-తిరుపతి (రైలు నం. 07482) 26న
కోర్బా-తిరువనంతపురం (రైలు నం. 22647) 28న,
కొచ్చివెల్లి-గోరఖ్పూర్ (రైలు నం. 12512) మే 25, 27, 28న
విశాఖపట్నం-న్యూఢిల్లీ (రైలు నం. 20805), 27, 28న
న్యూఢిల్లీ-విశాఖపట్నం (రైలు నం.20806) 27, 28న రద్దు చేశారు.
ఈరైళ్లను విజయవాడ-వరంగల్ మార్గంలో రద్దు చేసి.. దారి మళ్లించారు.
పాక్షికంగా రద్దు అయిన రైళ్ల వివరాలు..
సికింద్రాబాద్-గుంటూరు(రైలు నం.17202)మే 23-28,
గుంటూరు-సికింద్రాబాద్(రైలు నం.17201) మే 23-29 వరకు పాక్షికంగా రద్దు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa