ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ రైళ్లు కూడా చర్లపల్లి నుంచే.. జూన్ 1న ప్రారంభం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, May 24, 2025, 07:19 PM

వేసవి సెలవులు ముగిసిన.. ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా.. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుండి జూలై 31 వరకు వివిధ ప్రాంతాల మధ్య 44 ప్రత్యేక వారపు రైళ్లను నడపడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు రైల్వే అధికారులు శుక్రవారం (మే 24, 2025) ప్రకటించారు. ఈ ప్రత్యేక సర్వీసులు ముఖ్యంగా వేసవిలో తరచుగా ప్రయాణించే వారికి, ముఖ్యంగా విద్యా సంస్థలు తిరిగి ప్రారంభమయ్యే సమయంలో.. పర్యాటక ప్రదేశాలకు వెళ్లే వారికి ఎంతో ఉపయోగపడతాయి.


ప్రతి వేసవిలోనూ రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరుతుంది. సాధారణ రైళ్లు నిండిపోయి, టికెట్లు దొరకడం కష్టంగా మారుతుంది. ఈ సమస్యను తగ్గించడానికి.. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం కల్పించడానికి దక్షిణ మధ్య రైల్వే ఈ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ అదనపు రైళ్ల సేవలు ప్రయాణికులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందించడమే కాకుండా, చివరి నిమిషంలో టికెట్లు లభించక ఇబ్బందులు పడేవారికి ఊరటనిస్తాయి.


దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. పలు మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.


విశాఖపట్నం ఎస్‌ఎంవీటీ బెంగళూరు (రైలు నంబర్ 08581): ఈ మార్గంలో ఐదు రైళ్లు జూన్ 1 (ఆదివారం) నుండి జూన్ 29 వరకు నడుస్తాయి. ఇది బెంగళూరుకు వెళ్ళాలనుకునే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది.


ఎస్‌ఎంవీటీ బెంగళూరు టు విశాఖపట్నం (రైలు నంబర్ 08582): తిరుగు ప్రయాణంలో ఐదు రైళ్లు జూన్ 2 (సోమవారం) నుండి జూన్ 30 వరకు అందుబాటులో ఉంటాయి.


విశాఖ-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు.. రైల్వే ప్రచారం లేక ఖాళీగానే ప్రయాణం


విశాఖపట్నం టు తిరుపతి (రైలు నంబర్ 08547): ఈ మార్గంలో తొమ్మిది రైళ్లు జూన్ 4 (బుధవారం) నుండి జూలై 30 వరకు ప్రయాణించనున్నాయి. తిరుపతి వెళ్లే భక్తులకు, సాధారణ ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.


తిరుపతి టు విశాఖపట్నం (రైలు నంబర్ 08548): తిరిగి తొమ్మిది రైళ్లు జూన్ 5 (గురువారం) నుండి జూలై 31 వరకు నడుస్తాయి.


విశాఖపట్నం టు చర్లపల్లి (రైలు నంబర్ 08579): ఈ మార్గంలో ఎనిమిది రైళ్లు జూన్ 6 (శుక్రవారం) నుండి జూలై 25 వరకు సేవలందిస్తాయి.


చర్లపల్లి టు విశాఖపట్నం (రైలు నంబర్ 08580): తిరుగు ప్రయాణంలో ఎనిమిది రైళ్లు జూన్ 7 (శనివారం) నుండి జూలై 26 వరకు అందుబాటులో ఉంటాయి.


ఈ ప్రత్యేక రైళ్ల షెడ్యూల్‌ను రైల్వే శాఖ తమ అధికారిక వెబ్‌సైట్‌లో.. రైల్వే స్టేషన్లలో ప్రదర్శించనుంది. ప్రయాణికులు టికెట్లను ముందుగానే బుక్ చేసుకోవడం ద్వారా ప్రయాణ అసౌకర్యాలను నివారించుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. ఈ అదనపు సర్వీసులతో వేసవి రద్దీని సమర్థవంతంగా నిర్వహించవచ్చని దక్షిణ మధ్య రైల్వే ఆశిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa