ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో పెద్ద పండుగ.. జూన్ 2న కొత్త పథకాలు ప్రారంభం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, May 31, 2025, 04:00 PM

తెలంగాణ అవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో పెద్ద పండుగ రాబోతుంది. పలు సంక్షేమ పథకాలకు జూన్ 2న ముహుర్తంగా ఫిక్స్ చేసింది రేవంత్ సర్కార్. కీలక నిర్ణయాలు, కొత్త పథకాల అమలు జూన్ 2 నుంచే మొదలు కానుంది. ఇప్పటికే పలు పథకాలపై అప్డేట్ వచ్చిన సంగతి తెలిసిందే. మరి జూన్ 2 తెలంగాణలో మొత్తం ఎన్ని కొత్త పథకాలు మొదలు కాబోతున్నాయి.. ఎలాంటి కీలక నిర్ణయాలు అమల్లోకి రానున్నాయి అంటే..


జూన్ 2, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. తెలంగాణ సర్కార్ ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం, రాజీవ్ యువ వికాసం తొలి విడత నిధులు మంజూరు, మిగిలి ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు, ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డీఏ ప్రకటన వంటి పథకాలు, నిర్ణయాలు అమలు చేసేందుకు రెడీ అవుతోంది. వీటితో పాటు గ్రామ పాలన అధికారులకు అపాయింట్మెంట్లు ఇవ్వనుంది. అసైన్డ్ భూములు సాగు చేస్తున్న పేద రైతులకు పట్టాలు మంజూరు చేయనున్నారు.


అలానే జూన్ మూడో తేదీన… భూ సమస్యల పరిష్కారం, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కోసంనుంచి రెవెన్యూ సదస్సులను ప్రారంభించనుంది. ఇప్పటికే పైలెట్ మండలాల్లో సదస్సులు నిర్వహిస్తున్నారు అధికారులు. వీటికి మంచి స్పందన వస్తోంది అంటున్నారు అధికారులు. జూన్ 3 రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహించనున్నారు. అలానే రైతు భరోసా పథకం కింద పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న నిధులను విడుదల చేయనుంది. మే నెలలో వీటిని చెల్లించాల్సి ఉండే. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల వాయిదా పడింది.


అలానే గ్రామ స్థాయిలో మెరుగైన పరిపాలన అందించేందుకు గాను రేవంత్ స్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా.. తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఆఫీసర్ (జీపీవో) పోస్టులను భర్తీ చేస్తోంది. ఈ క్రమంలో జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దాదాపు 3,500 మందిని రెవెన్యూ శాఖలోకి తీసుకునేందుకు రేవంత్ సర్కార్ సిద్ధం అయ్యింది. వీరికి జూన్ 2 రీఅపాయింట్మెంట్ లెటర్లు అందజేయనున్నారు. అలానే ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లపైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం జూన్ 2న కీలక ప్రకటన చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నారు. దీనిలో భాగంగా పెండింగ్ డీఏ విడుదలపై ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు.


తెలంగాణ అవిర్భావ దినోత్సవాన్నిపురస్కరించుకుని.. కాంగ్రెస్ ప్రభుత్వం పలు నూతన సంక్షేమ పథకాలు, కీలక నిర్ణయాలు ప్రకటించి..రాష్ట్రంలో పండగ వాతావరణం నెలకొనేలా చేయనుంది. ఈమేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త పథకాల ప్రకటన, నిధుల మంజూరు వంటి కార్యక్రమాలతో రాష్ట్రంలో పండగ వాతావరణం నెలకొననుంది. ప్రజలు కూడా వీటి కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa