ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ 2025 ఫైనల్స్ అంగరంగ వైభవంగా ప్రారంభం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 01, 2025, 06:19 AM

మిస్ వరల్డ్ 2025 పోటీల ఫైనల్స్ హైదరాబాద్ నగరంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని హైటెక్స్ వేదికగా జరుగుతున్న ఈ అందాల పోటీలు బాలీవుడ్ తారల ప్రత్యేక ప్రదర్శనలతో మరింత శోభను సంతరించుకున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక కిరీటం కోసం ప్రపంచవ్యాప్తంగా 108 దేశాలకు చెందిన అందాల భామలు పోటీ పడుతున్న విషయం తెలిసిందే.ఈ పోటీల్లో భాగంగా ఇప్పటికే పలు దశల్లో తమ ప్రతిభను చాటుకున్న అందగత్తెల నుంచి 16 మంది క్వార్టర్స్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. వీరి నుంచి చివరి రౌండ్‌లో నలుగురిని ఎంపిక చేయనున్నారు. అమెరికా-కరేబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా-ఓషియానా ఖండాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఈ నలుగురు ఫైనలిస్టులుగా నిలుస్తారు. ఈ నలుగురికి అడిగే చివరి ప్రశ్న, దానికి వారు ఇచ్చే సమాధానం ఆధారంగా న్యాయనిర్ణేతలు మిస్ వరల్డ్ 2025 విజేతను ప్రకటించనున్నారు.ఈ ఫైనల్ పోటీలకు న్యాయనిర్ణేతల బృందంలో ప్రముఖ నటుడు సోనూ సూద్, వ్యాపారవేత్త సుధారెడ్డి, 2014 మిస్ ఇంగ్లండ్ కెరీనా ఉన్నారు. మిస్ వరల్డ్ సంస్థ ఛైర్మన్ జూలియా మోర్లీ ఈ న్యాయనిర్ణేతల ప్యానెల్‌కు హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా, ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమ నుంచి ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా, నటి నమ్రత హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa