రూ.56 లక్షల జీహెచ్ఎంసీ నిధులు కాజేసిన మహిళా కంప్యూటర్ ఆపరేటర్. జీహెచ్ఎంసీలో క్రమక్రమంగా బయటపడుతున్న అవినీతి బాగోతాలు . శేరిలింగంపల్లి జోన్లోని చందానగర్ సర్కిల్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో పౌర సేవ కేంద్రాల్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సుభాషిణి అనే మహిళ. ట్రేడ్ లైసెన్స్, జనన మరణ ధృవీకరణ పత్రాలు, ఆస్తి పన్ను దరఖాస్తుల స్వీకరణ వంటి పనులకు ప్రజల నుండి వసూలు చేసిన డబ్బులు జీహెచ్ఎంసీ ఖజానాలో జమ చేయలేదని తేల్చిన ఆడిటర్లు . 2024–25 ఆర్థిక సంవత్సరం నుండి ఇప్పటి వరకు రూ.56 లక్షలు కాజేసినట్టు నిర్ధారించిన ఆడిట్ అధికారులు . ఆడిట్ జరుగుతుందని తెలిసి విధులకు హాజరు కాకపోవడంతో, ఆమెను బలవంతంగా కార్యాలయానికి రప్పించిన ఉన్నతాధికారులునిధులు కాజేసినట్టు అంగీకరించి, కేవలం ఒక్క రోజులోనే జీహెచ్ఎంసీ ఖాతాలో రూ.56 లక్షలు జమ చేసిన మహిళా ఆపరేటర్ సుభాషిణి
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa