నిర్మల్ జిల్లాలోని బాసరలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో బాసర ఆలయం వద్ద వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. పుష్కర ఘాట్లు సైతం మునిగిపోయాయి. ఆలయానికి వెళ్లే దారి పూర్తిగా జలమయం అయింది. మూడు లాడ్జిలు, ఒక ప్రైవేట్ అతిథి గృహం జలదిగ్భంధమయ్యాయి. దాదాపు తొమ్మిది మంది కుటుంబాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. వీరికి పోలీసులు, స్థానికులు ఆహారం అందిస్తున్నారు. ఇప్పటికే ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa