ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రానికి త్వరలో యూరియా సరఫరా.. రైతులకు తుమ్మల గుడ్ న్యూస్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 29, 2025, 03:44 PM

రాష్ట్రంలో సాగు కాలం వేగంగా కొనసాగుతున్న తరుణంలో, రైతులకు తీపి కబురుతో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ముందుకొచ్చారు. మరో రెండు రోజుల్లో 21,325 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి రానున్నట్టు ఆయన తెలిపారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా గా ఈ చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
యూరియాను పోర్టుల నుంచి నేరుగా రాష్ట్రంలోని కీలక ప్రాంతాలకు తరలించనున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, జడ్చర్ల, గద్వాల్, వరంగల్, మిర్యాలగూడ, పందిళ్లపల్లి, సనత్ నగర్, గజ్వేల్ ప్రాంతాలకు త్వరితగతిన సరఫరా చేయనున్నట్టు మంత్రి వెల్లడించారు. అందుబాటులోకి వస్తున్న యూరియాను తక్షణమే రైతులకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు.
ఇక పంట నష్టాల అంచనా విషయంలో కూడా చర్యలు చేపట్టాలని తుమ్మల సూచించారు. అధికారులు బృందాలుగా ఏర్పడి జిల్లాల్లో పర్యటించి, పంట నష్టం వివరాలను సేకరించాలని తెలిపారు. నష్టపోయిన రైతులకు సకాలంలో సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వివరించారు.
రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని తుమ్మల స్పష్టం చేశారు. విత్తనాలు, ఎరువులు, సాగు నీటి అంశాల్లో ఎలాంటి లోపం రాకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. రైతుల బాధ్యత ప్రభుత్వానిదేనని, ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa