తెలంగాణలో భారీ వర్షాల కారణంగా 270 మండలాలు మరియు 2,463 గ్రామాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. వర్షాలు కారణంగా వరि, పత్తి, మొక్కజొన్న, టమాట, కంది వంటి పంటలకు భారీ నష్టం ఎదురైనట్లు తెలిపారు.ప్రాథమిక అంచనా ప్రకారం, మొత్తం 2,20,443 ఎకరాల విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. దీనిపై జిల్లాల వారీగా పంట నష్ట నివేదికను ప్రభుత్వానికి సమర్పించామని కూడా వెల్లడించారు.నివేదికలో పేర్కొనబడినట్లుగా, వరికి 1,09,626 ఎకరాలు, పత్తికి 60,080 ఎకరాలు, సోయాబీన్కు 6,751 ఎకరాలు, మరియు ఉద్యాన పంటలకు 639 ఎకరాల మేర తీవ్ర నష్టం వాటిల్లింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa