ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సికింద్రాబాద్, చర్లపల్లి నుంచి.. ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టిన దక్షిణ మధ్య రైల్వే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 30, 2025, 08:37 PM

దసరా, దీపావళి పండుగ సమయాల్లో ప్రయాణికుల రద్దీని ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా రైల్వే ప్రయాణికుల సంఖ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జనరల్ బోగీలు అతి తక్కువగా ఉండటంతో చాలా మంది రిజర్వేషన్ చేసుకోవడానికే మొగ్గు చూపుతుంటారు. ఇప్పటికే చాలా వరకు ట్రైన్లలో రిజర్వేషన్లు సీట్స్ అయిపోయాయి. కొన్ని ట్రైన్స్ అయితే వెయిటింగ్ లిస్ట్ వందల్లో చూపిస్తోంది.


అలాంటి వారి కోసం దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రయాణికుల దృష్టిలో ఉంచుకుని అదనపు రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. చర్లపల్లి, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి వివిధ ప్రదేశాలకు ఈ ప్రత్యేక సర్వీసులు నడవనున్నాయి. పండుగల సమయంలో సాధారణంగా టికెట్‌ల కొరత ఎక్కువగా ఉండటంతో.. ఈ నిర్ణయం ప్రయాణికులకు ఉపశమనం కలిగించనుంది.


ప్రత్యేక రైళ్ల షెడ్యూల్..


చర్లపల్లి – దానాపూర్ (07419): సెప్టెంబర్ 6 నుంచి నవంబర్ 29 వరకు ప్రతి శనివారం నడుస్తుంది.


దానాపూర్ – చర్లపల్లి (07420): సెప్టెంబర్ 8 నుంచి డిసెంబర్ 1 వరకు ప్రతి సోమవారం సర్వీస్ ఉంటుంది.


చర్లపల్లి – బర్హంపూర్ (07027): సెప్టెంబర్ 5 నుంచి నవంబర్ 28 వరకు ప్రతి శుక్రవారం నడుస్తుంది.


బర్హంపూర్ – చర్లపల్లి (07028): సెప్టెంబర్ 6 నుంచి నవంబర్ 29 వరకు ప్రతి శనివారం నడవనుంది.


చర్లపల్లి – శాలిమార్ (07225): సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 10 వరకు ప్రతి సోమవారం సర్వీస్ అందుబాటులో ఉంటుంది.


శాలిమార్ – చర్లపల్లి (07226): సెప్టెంబర్ 2 నుంచి అక్టోబర్ 14 వరకు ప్రతి మంగళవారం నడుస్తుంది.


సికింద్రాబాద్ – మైసూర్ జంక్షన్ (07033): సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు ప్రతి సోమ, శుక్రవారాల్లో నడుస్తుంది.


మైసూర్ జంక్షన్ – సికింద్రాబాద్ (07034): సెప్టెంబర్ 2 నుంచి నవంబర్ 1 వరకు ప్రతి మంగళ, శనివారాల్లో సర్వీస్ ఉంటుంది.


దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈ రైళ్లలో ఆధునిక సౌకర్యాలు, శుభ్రమైన కోచ్‌లు, తగిన భద్రతా ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పండుగ రద్దీని తగ్గించడంతో పాటు.. టూరిజం, కుటుంబ విహారాలకు కూడా ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. టికెట్లు IRCTC వెబ్‌సైట్‌తో పాటు స్టేషన్ బుకింగ్ కౌంటర్లలో లభిస్తాయి. రైల్వే ప్రయాణికులు ముందస్తుగా రిజర్వేషన్ చేసుకోవాలని సూచించింది.


ఇదిలా ఉండగా.. దసరా, దీపావళి, ఛత్‌ పండుగల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే 2025 ఆగస్టు నుండి డిసెంబర్ వరకు 170 ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది. అక్టోబర్‌ 6 నుంచి నవంబర్‌ 24 వరకు ఈ ట్రైన్స్ అందుబాటులో ఉండనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa