ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వినాయకుడి ఫ్లెక్సీ సరి చేస్తూ కరెంట్ షాక్‌తో యువకుడు మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 01, 2025, 02:15 PM

హైదరాబాద్ – ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని రవీంద్రనాయక్‌నగర్ కాలనీలోని హనుమాన్ దేవాలయంలో గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ముగ్గురు స్నేహితులు. బంజారా హోటల్ వద్ద ఏర్పాటు చేసిన ఉత్సవాల ఫ్లెక్సీ కిందకి జారడంతో, ఒక భవనంపైకి ఎక్కి దాన్ని సరి చేసే ప్రయత్నం చేసిన కె.భరత్(33. ఈ క్రమంలో పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్ వైర్లు ఇనుప రాడ్డుకు తాకడంతో అక్కడికక్కడే మృతిచెందిన భరత్ . ఈ ప్రాంతంలో బంచ్ కేబుల్ ఏర్పాటు చేయాలని ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా విద్యుత్ అధికారులు పట్టించుకోలేదని, భరత్ మృతికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని విద్యుత్ ఏఈ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు, స్నేహితులు .భరత్ ఒక సామాన్య ఆటో డ్రైవర్ అని, తన కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం, తన భార్యకి ప్రభుత్వ ఉద్యోగం, ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించాలని డిమాండ్ చేసిన స్నేహితులు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa