తెలంగాణలోని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో చోటుచేసుకున్న అవకతవకలపై సీబీఐ విచారణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థకు అధికారికంగా లేఖ రాసింది. సోమవారం రోజున జీవో నంబర్ 104ని జారీ చేసి, కేసును సీబీఐకి బదిలీ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది.
ప్రభుత్వం పంపిన లేఖ మంగళవారం సీబీఐకు చేరింది. లేఖను స్వీకరించినట్లు సీబీఐ అధికారికంగా అంగీకార పత్రం ఇచ్చింది. ఈ చర్యతో కేసు దర్యాప్తు నేరుగా సీబీఐ చేతిలోకి వెళ్ళనున్నది. దీనివల్ల కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి తప్పుదారి పట్టింపు జరిగిందన్నది బయట పడే అవకాశం ఉంది.
కేంద్ర దర్యాప్తు సంస్థకు అన్ని రకాల సమాచారాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని స్పష్టం చేసింది. విచారణకు అవసరమైన ఆధారాలు, ఫైళ్ళు, ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించిన వివరాలన్నింటినీ సమర్పించనున్నట్లు తెలిపింది. ప్రభుత్వ ఈ విధానానికి ప్రజల నుండి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.
కాళేశ్వరం ప్రాజెక్టు పై విమర్శలు మునుపటి నుంచే వస్తున్నప్పటికీ, ఇప్పుడు అధికారికంగా సీబీఐ విచారణకు బాటలు వేసిన ప్రభుత్వం నిర్ణయం రాజకీయంగానూ, పరిపాలనపరంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ దర్యాప్తు ప్రాజెక్టులో జరిగిన అసలు దోపిడీ పై వెలుగు పోసే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa