తెలంగాణలో అల్పపీడనం ప్రభావం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం మారుతోంది. భారత వాతావరణ శాఖ ఇప్పటికే ఇవాళ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రభావం రాజధానిలో స్పష్టంగా కనిపిస్తోంది.
హైదరాబాద్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. ప్రత్యేకించి మాదాపూర్, గచ్చిబౌలి, దుర్గం చెరువు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఆకాశం మేఘావృతమై ఉండటంతో నగరంలోని అనేక ప్రాంతాల్లో వర్ష సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
వర్షం కారణంగా ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. వాహనదారులు మరియు ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఇప్పటికే కొన్ని లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు కనిపిస్తున్నట్లు సమాచారం.
అధికారులు ప్రజలకు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వర్షపాతం ఎక్కువగా ఉండే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు అనవసర ప్రయాణాలు నివారించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ కారిడార్ పరిధిలోని ఉద్యోగులు వర్ష పరిస్థితుల నేపథ్యంలో ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa