తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదంటూ బీఆర్ఎస్ పార్టీ ఘాటుగా స్పందించింది. ఈ నేపథ్యంలో మెడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో బీఆర్ఎస్ నేతలు రాస్తారోకో నిర్వహించారు. మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు రైతుల కోసం బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించారని, దీని వల్ల లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిందని వారు తెలిపారు. రైతుల జీవితాలను మార్చిన ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ తక్కువ చేయాలని చూస్తోందని ఆరోపించారు. ప్రజలకు మేలు చేసే ప్రాజెక్టును విమర్శించడం ప్రజావ్యతిరేక చర్య అని వారు పేర్కొన్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, మాజీ సీఎం కేసీఆర్ను అప్రతిష్టపాలు చేయాలనే దుష్ట లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణలు చేపడుతున్నదని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఇది కేవలం రాజకీయం చేసేందుకే చేస్తున్న చర్యలని వారు తెలిపారు. ప్రాజెక్టు విషయంలో నైతికంగా నిలబడాల్సింది కాంగ్రెస్ేనని వారు అభిప్రాయపడ్డారు.
ఇలాంటి కుట్రల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉన్నారని, సరైన సమయంలో కాంగ్రెస్కు గుణపాఠం చెబుతారని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. కేసీఆర్ చేసిన అభివృద్ధిని విస్మరించలేమని, ప్రజలు ఇంకా ఆయన నాయకత్వాన్ని విశ్వసిస్తున్నారని వారు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa