ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్ గణేష్ నిమిజ్జనం శోభాయాత్రకి ప్రత్యేక అతిథిగా అమిత్ షా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 02, 2025, 05:10 PM

హైదరాబాద్‌లో ప్రతి సంవత్సరం వినాయక చవితి ఘనంగా నిర్వహిస్తారు. మరీ ముఖ్యంగా ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనం కోసం ప్రతి రోజు వేల మంది భక్తులు తరలి వస్తుంటారు. ఇక సెలవు దినాల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. అలానే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనానికి కూడా భారీ సంఖ్యలో భక్తులు హజరవుతుంటారు. ఖైరతాబాద్ అనేకాక భాగ్యగనరంలో గణేష్ నిమిజ్జనం శోభాయాత్ర చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఈ ఏడాది శోభాయాత్ర పాల్గొనడం కోసం కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ వస్తున్నారు. ఆ వివరాలు...


వినాయకుడి నిమజ్జనం నేపథ్యంలో ఆగస్టు 6, శనివారం నాడు కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. భాగ్యనగర్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు అమిత్ షా నిమజ్జనం వేడుకలో పాల్గొనబోతున్నారు. ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం కార్యక్రమానికి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు కానున్న నేపథ్యంలో నగర పోలీసులు భధ్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 6న ఉదయం 11 గంటలకు అమిత్ షా బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. ఉదయం 11.30 గంటల నుంచి 12.30 గంటల వరకు ఐటీసీ కాకతీయలో బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు చార్మినార్ దగ్గర వినాయక నిమజ్జన శోభాయాత్రలో పాల్గొననున్నారు. శనివారం మధ్యాహ్నం ఎంజే మార్కెట్ వద్ద నిమజ్జన శోభాయాత్రలో పాల్గొని.. ఆయన ప్రసంగిస్తారు.


ఈ సంవత్సరం వినాయక నిమజ్జనం మీద అనేక సందేహాలు పుట్టుకొచ్చాయి. అందుకు కారణం చంద్రగ్రహణం. దీంతో నిమజ్జనం ఎప్పుడు అనే దానిపై అనేక ప్రచారాలు తెర మీదకు వచ్చాయి. ఈక్రమంలోగణేష్ ఉత్సవ కమిటీ దీనిప స్పష్టతనిస్తూ ప్రకటన జారీ చేసింది. శనివారం నాడు అనగా సెప్టెంబర్ 6వ తేదీనే గణపతి నిజమ్జనం నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో వినాయక నిమజ్జనం మీద భక్తులకు క్లారిటీ వచ్చింది.


హైదరాబాద్‌లో జరిగే వినాయక నిమజ్జన వేడుకలు ప్రత్యక్షంగా చూసేందుకు భారీ ఎత్తున జనాలు తరలి వస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖలు ఏర్పాట్లు చేస్తున్నాయి. నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్ ప్రాంతంలో పెద్దసంఖ్యలో క్రేన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సంవత్సరం భారీ సంఖ్యలో విగ్రహాలు అక్కడికి చేరతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. నిమజ్జనం వేడుకలు చూడటానికి వచ్చే భక్తులకు తాగునీరు, వైద్య సేవలు, అందిచడమే కాక ట్రాఫిక్ నియంత్రణ వంటి వాటి కోసం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa