గద్వాలలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి రంగం సిద్ధమైంది.దౌదర్పల్లి వద్ద ఐదేళ్ల క్రితం ప్రారంభించిన 1,275 ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో పూర్తయింది. అయితే కొన్ని కారణాల వలన ఇప్పటి వరకు పంపిణీ జరగలేదు. ప్రస్తుతం వార్డుల వారీగా లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు.మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులతో సమావేశమై మిగిలిన పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం డబుల్ బెడ్రూం ఇళ్ల వద్దకు వెళ్లి పెండింగ్ పనులను పరిశీలించారు.ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి మాట్లాడుతూ… పేదల సొంతింటి కలను సాకారం చేయడానికి ప్రభుత్వం ముందడుగు వేసిందని తెలిపారు. ఎంతోకాలంగా ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలకు శనివారం (6న) గృహప్రవేశాలు జరగనున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చేతుల మీదుగా ఇళ్ల పంపిణీ జరుగుతుందని వెల్లడించారు.కలెక్టర్ మాట్లాడుతూ హెచ్-3 బ్లాక్లో మంత్రి గృహప్రవేశాలు చేయనున్నారని, అప్పటికి పారిశుధ్య సహా పెండింగ్ పనులన్నీ పూర్తవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, గృహనిర్మాణ శాఖ పీడీ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa