వినాయక నవరాత్రి ఉత్సవాల సప్తమి (ఏడవ రోజు) సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు, MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్ గారు పటాన్చెరు డివిజన్ పరిధిలోని పలు వినాయక మండపాలను సందర్శించి గణనాథుని ఆశీర్వాదం పొందారు. శ్రీనగర్ కాలనీ, శాంతినగర్, బండ్లగూడ, జేపీ కాలనీ, గౌతమ్నగర్, శ్రీరామ్నగర్ కాలనీ, బాలాజీ నగర్, సాయి కాలనీ, అంబేడ్కర్ కాలనీ, గోకుల్ నగర్, కుమ్మరి బస్తీ, సీతారామయ్య కాలనీ, భకత్ గల్లీ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మండపాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొని, భక్తులతో కలిసి అన్నదాన కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు. స్వయంగా అన్నప్రసాదం వడ్డిస్తూ భక్తులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ప్రిథ్వీరాజ్ గారు మాట్లాడుతూ అన్నదానం మహాదానం. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కన్నా గొప్ప పూజ మరొకటి లేదు. వినాయక ఉత్సవాల్లో జరిగే అన్నదాన కార్యక్రమాలు సమాజంలో సానుభూతి, పంచుకోవాలనే మనసును పెంపొందిస్తాయి అని పేర్కొన్నారు. వినాయక ఉత్సవాలు సామాజిక ఐక్యతకు ప్రతీకలు. పండుగలు కేవలం వినోదానికి మాత్రమే కాకుండా సేవా కార్యక్రమాలకు వేదిక కావాలి. యువత ముందుకు వచ్చి సమాజ సేవలో భాగస్వామ్యం కావాలి అని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa