స్కూల్లకు దసరా సెలవులు మొదలయ్యాయి. మరో రెండు రోజుల్లో కాలేజీలకు కూడా హాలీడేస్ రాబోతోన్నాయి. ఇకపై, గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని నదులు, సరస్సులు నిండిపోతున్నాయి.జలపాతాలు జలకళను పూయగా, తాజా సుందరంగా లక్నవరం సరస్సు పర్యాటకులను ఆకర్షిస్తోంది. వరంగల్ నుంచి కేవలం 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సరస్సు అందాలను తనివితీరా ఎంజాయ్ చేసేందుకు ప్రజలు తరలివస్తున్నారు.చుట్టూ కొండలు, చెట్లు, వంతెన కింద ప్రవహిస్తున్న నీళ్లు… వీటిని చూస్తే మనకు కోనసీమ, అరకు, కేరళని అనిపిస్తుంది. ప్రస్తుతం ములుగు జిల్లా లక్నవరం సరస్సు పర్యాటకులకు స్వర్గధామంగా మారింది. జోరు వానల వల్ల సరస్సులోకి భారీగా వరద నీరు వస్తోంది. వీకెండ్స్లో, హైదరాబాద్ నుంచి కుటుంబ సమేతంగా పర్యాటకులు సరస్సు అందాలను తిలకిస్తూ, బోటింగ్, ఇతర ఫన్నీ ఆక్సివిటీలను ఆనందంగా ఆస్వాదిస్తున్నారు.చుట్టూ కొండల మధ్య, హరిత రిసార్ట్స్, ఇతర సదుపాయాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి ములుగు జిల్లాలోని లక్నవరం జలాశయానికి 219 కిలోమీటర్ల దూరం, సుమారు 4 గంటల్లో చేరుకోవచ్చు.ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని ఈ సరస్సు 13వ శతాబ్దంలో కాకతీయ రాజు గణపతి రుద్రదేవుడు నిర్మించారని సమాచారం. సరస్సులో బోటింగ్, వాటర్ స్పోర్ట్స్ వంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. పర్యాటకులు చెబుతున్నారు – “కొండల మధ్య బోటింగ్ చేస్తూ, ప్రకృతి అందాలను చూస్తూ మనసుకు ప్రశాంతత లభిస్తోంది. అందం చూడడం మైమరిచిపోతున్నట్టే ఉంది.”అలాగే, లక్నవరం ఐలాండ్ కూడా ఉంది. ఇక్కడ పర్యాటకుల సౌకర్యార్థం పచ్చని ఉద్యానవనాలు ఏర్పాటు చేశారు. మొత్తం 22 కాటేజీలు ఉన్నాయి. ఈ ద్వీపం మాల్దీవులు, సిమ్లా, మున్నార్ ప్రాంతాలను గుర్తు చేస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa