సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రూ.3 కోట్ల నష్టపరిహారాన్ని విడుదల చేసింది. ఈ దుర్ఘటనలో మరణించిన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.1 లక్ష చొప్పున పరిహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను స్వదేశానికి తరలించేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa