ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సౌదీ బస్సు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించిన సర్కార్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 20, 2025, 11:53 AM

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రూ.3 కోట్ల నష్టపరిహారాన్ని విడుదల చేసింది. ఈ దుర్ఘటనలో మరణించిన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.1 లక్ష చొప్పున పరిహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను స్వదేశానికి తరలించేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa