గణతంత్ర దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో డ్రోన్ కెమెరాలు, డ్రోన్లు, రిమోట్ కంట్రోల్లో నడిచే పారా గ్లైడర్లు, మైక్రోలైట్ విమానాల వినియోగంపై నిషేధం విధించారు. ఈ మేరకు మల్కాజిగిరి డిప్యూటీ కమిషనర్ శ్రీధర్ వివరాలను వెల్లడించారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని, బేగంపేట, మార్కెట్, మారేడ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అమల్లోకి వస్తాయని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa