హైదరాబాద్లోని చర్లపల్లి నుంచి ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లికి వారానికోసారి నడిచే ఎక్స్ప్రెస్ స్పెషల్ రైలును దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. ఈ రైలు ప్రతి గురువారం రాత్రి 10 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి, శుక్రవారం ఉదయం 11 గంటలకు అనకాపల్లి చేరుకుంటుంది. తిరిగి శనివారం ఉదయం 6.40 గంటలకు అనకాపల్లి నుంచి బయలుదేరి, అదేరోజు అర్ధరాత్రి 12 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ కొత్త రైలు ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa