అప్పటివరకు అందరితో కలిసి ఆడుతూ పాడుతూ చదువుతూ ఉన్న ఓ బాలిక ఉన్నట్టుండి తరగతి గదిలోనే కుప్పకూలింది. అది గమనించిన తోటి విద్యార్థినులు.. టీచర్లకు సమాచారం అందించారు. వెంటనే వారు అలర్ట్ అయి.. ఆ బాలికను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ బాలిక ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో వారంతా షాక్ అయ్యారు. అయితే ఆ బాలికకు ముందు నుంచీ గుండె సంబంధింత వ్యాధులు ఉన్నాయని ప్రాథమికంగా వెల్లడైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇక బాలిక ఆ క్లాస్రూంలో కుప్పకూలిపోయిన ఘటన.. అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ కాగా.. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
తమిళనాడు రాణిపేటలో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల అద్విత అనే విద్యార్థిని.. గుండెపోటుతో ప్రాణాలు విడిచింది. స్కూల్లో టీచర్ పాఠాలు చెబుతుండగానే వెనక బెంచ్లో కూర్చున్న అద్విత.. ఒక్కసారిగా పక్కనే ఉన్న మరో విద్యార్థినిపై పడిపోయింది. అయితే అది గమనించిన ఆ విద్యార్థిని విషయాన్ని టీచర్కు చెప్పింది. ఆ టీచర్ వచ్చి ఆమెను పరీక్షించగా.. స్పృహ కోల్పోయింది. దీంతో వెంటనే స్కూల్ యాజమాన్యానికి సమాచారం అందించగా.. వెంటనే అద్వితను సమీపంలో ఉన్న ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు.
అయితే అప్పటికే అద్విత ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ఆ బాలికకు గుండెపోటుతో కుప్పకూలిపోయిన సమయంలో క్లాస్రూమ్లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీంతో మరోసారి గుండెపోటుల గురించి తీవ్ర చర్చ జరుగుతోంది. గత కొంత కాలంగా చిన్న చిన్న పిల్లలు, యువకులు ఉన్నట్టుండి అకస్మాత్తుగా కుప్పకూలిపోయి.. ప్రాణాలు విడుస్తున్న సంఘటనలు పెరుగుతుండటం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. అప్పటివరకు యాక్టివ్గా ఉన్నవారు కూడా ఒక్కసారిగా గుండెపోటుతో కిందపడి చనిపోతున్న ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూనే ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa