కాలువలపై సౌరశక్తితో విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2015లోనే కాలువపై సింగిల్ మెగావాట్ ప్లాంట్కు శ్రీకారం చుట్టిందన్నారు. గత ప్రభుత్వం సోలార్ ప్లాంట్ల నిర్వహణను గాలికి వదిలేసిందన్నారు. భీమవరంలో నిర్వీర్యం చేసిన ప్లాంటును పరిశీలించామన్నారు. ప్లాంటు నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయాలని నెడ్ క్యాప్ను ఆదేశించామన్నారు.