ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. అయితే సీఎం రేసులో బీజేపీ ఎంపీ బన్సూరీ స్వరాజ్ పేరు కూడా వినిపిస్తోంది. ఆమె దివంగత నేత సుష్మా స్వరాజ్ కుమార్తె. గతేడాదే బన్సూరీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు.
ఆ ఎన్నికల్లో న్యూఢిల్లీ లోక్సభ నుంచి గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. తాజా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. దీంతో ఆమె సీఎం రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.