ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీకు సైకిల్ ట్రాక్ కావాలా,,,పిటీషన్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం

national |  Suryaa Desk  | Published : Mon, Feb 10, 2025, 07:57 PM

్ఓ పిటీషన్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇదిలావుంటే భారత దేశ వ్యాప్తంగా సైకిల్ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలంటూ సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలు అయింది. దానిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం.. ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మురికి వాడల్లో ఉండే ప్రజలకు కనీసం ఉండేందుకు ఇళ్లు లేవని.. తాగేందుకు గుక్కెడు మంచినీళ్లు కూడా దొరకట్లేదని చెప్పుకొచ్చింది. అలాంటి వాళ్ల గురించి ఏమాత్రం ఆలోచించకుండా.. మీకు మాత్రం సైకిల్ ట్రాక్ కావాలని ఎలా అడుగుతున్నారని ప్రశ్నించింది. ఆపూర్తి వివరాలు మీకోసం.


సైక్లింగ్ ప్రమోటర్ దేవిందర్ సింగ్ నాగి ఇటీవలే సుప్రీం కోర్టులో.. దేశ వ్యాప్తంగా సైకిల్ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలంటూ ఓ పిటిషన్ వేశారు. అనేక రాష్ట్రాల్లో రోడ్లపై రైళ్ల కోసం ప్రత్యేక ట్రాక్‌లు ఉన్నాయని.. దేశ వ్యాప్తంగా ఈ సౌకర్యాన్ని కల్పించాలంటూ పిటిషన్‌లో కోరారు. ధర్మాసనం నేడు దీనిపై విచారణ చేపట్టింది. ముఖ్యంగా పేద ప్రజలకు ఇండ్లు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వాల వద్ద సరిపడా నిధులు లేవని, బస్తీ ప్రజలకు మంచినీళ్లు కూడా అందించలేకపోతున్నారని చెప్పుకొచ్చింది.


 ఇలాంటి సందర్భాల్లో మీకు సైకిల్ ట్రాక్‌లు కావాలని పగటి కలలు కంటున్నారా అంటూ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, ఉజ్వల్ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. ఒకసారి మురికి వాడలకు వెళ్లి చూడమని చెప్పింది. వారి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోండని.. కనీస సౌకర్యాలు కూడా ఉన్నాయో లేవో చూడమంటూ వివరించారు. అలాగే ప్రముఖ్యత విషయంలో తప్పుదోవ పడుతున్నామని, మన ప్రాధాన్యతలను సరైన మార్గంలో పెట్టాలని సూచించారు.


రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 గురించి ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం ఉందని.. ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీరు అందడం లేదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ బడులను మూసివేస్తున్నారని, ఇలాంటి సమయంలో మీకు సైకిల్ ట్రాక్‌లు కావాల్సి వస్తోందా అని పిటిషనర్‌ను న్యాయస్థానం మందలించింది. ప్రస్తుతం సుప్రీం కోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతుండగా.. నెటిజెన్లు అంతా పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నారు. రాజకీయ నాయకులకు సైతం ఇలాగే చెబితే బాగుంటుందంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com