ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రాఫిక్ సమస్యల కారణంగా వాయిదాపడుతున్న అలహాబాద్ హైకోర్టు

national |  Suryaa Desk  | Published : Mon, Feb 10, 2025, 08:05 PM

ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళ్తున్నారు. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం భక్తులు పోటెత్తుతుండగా.. రోడ్లన్నీ స్తంభించిపోయాయి. దాదాపు 60 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోగా.. భక్తులు అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారు. కేవలం కుంభమేళాకు వెళ్లే వాళ్లే కాకుండా సామాన్య ప్రజలు సైతం ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అలహాబాద్ హైకోర్టులోని కేసులన్నీ పెండింగ్‌లో పడ్డాయి. దీనికి గల కారణం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళా జనవరి 13వ తేదీన ప్రారంభం కాగా.. పెద్ద ఎత్తున భక్తులు అక్కడకు వెళ్తున్నారు. విదేశాల నుంచి సైతం ప్రముఖులు వస్తూ.. త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఈక్రమంలోనే ప్రయాగ్ రాజ్ వెళ్లే మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్‌లు అవుతున్నాయి. ముఖ్యంగా వారం రోజుల నుంచి అయితే 200 నుంచి 300 కిలో మీటర్ల మేర ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. 50 కిలో మీటర్లు ప్రయాణించేందుకు 10 నుంచి 12 గంటల సమయం పడుతుంది. 45 రోజుల పాటు సాగే ఈ మహా కుంభమేళా జనవరి 26వ తేదీ వరకు కొనసాగనుంది. అప్పటి వరకు ప్రజలకు ట్రాపిక్ సమస్యలు తప్పేలా లేవు.


అయితే ఈ ట్రాఫిక్ సమస్యల వల్లే ఉత్తర ప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టులో కేసులన్నీ గత కొన్ని వారాలుగా పెండింగ్‌లో పడుతున్నాయి. రద్దీ వల్ల పిటిషన్ దారులు, లాయర్లు సమయానికి కోర్టుకు హాజరు కాలేకపోతున్నారు. దీంతో చేసేదేమీ లేక ఆ కేసులను వాయిదా వేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఆల్ట్ న్యూస్ జర్నలిస్ట్, ఫ్యాక్ట్ చెకర్ మొహమ్మద్ జుబేర్ ఓ పిటిషన్ వేశారు. ఘజియాబాద్ దస్నా దేవి ఆలయం కేసులో నమోదు అయిన క్రిమనల్ కేసును కొట్టివేయాలంటూ న్యాయస్థానాన్ని విన్నవించారు.


ఈ పిటిషన్‌పై ఈరోజు అలహాబాద్ హైకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. కానీ కుంభమేళా ట్రాఫిక్ కారణంగా పిటిషనర్లు కోర్టుకు హాజురు కాలేకపోయారు. దీంతో చేసేదేమీ లేక జస్టిస్ సిద్దార్థ్ వర్మ, జస్టిస్ యోగేంద్ర కుమార్ శ్రీవాత్సవ్ కేసును వాయిదా వేశారు. ముఖ్యంగా ట్రాఫిక్ నిబంధనల వల్ల ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేకపోతున్నట్లు తెలిపారు. ఈ కారణం వల్లే ఇరు పార్టీలకు చందిన వాళ్లు హాజరు కాలేకపోయారని స్పష్టం చేశారు. దీని కారణంగానే జుబేర్‌కు ఫిబ్రవరి 17వ తేదీ వరకు అరెస్టు నుంచి తాత్కాలిక ఉపశమనం లభించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com