పిల్లలకు పరిశుభ్రత, ఆరోగ్యంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అవగాహన కల్పించా లని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ సూచించారు. అనంతపురం స్థానిక శారదా మున్సిపల్ స్కూల్ లో సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగు నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ విద్యార్థుల సంక్షేమం, చదువు కోసం ఎంతో ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే పలువురు విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న, డీఎంహెచఓ ఈబీ దేవి, నగర కమిషనర్ బాలస్వా మి, ఐసీడీఎస్ పీడీ వనజాఅక్కమ్మ, డీఈఓ ప్రసాద్బాబు, సీడీపీఓ లలిత, డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |