ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనంతపురం లో మార్కెట్‌ రుసుము వసూలుచేసుకునే హక్కుకు వేలం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 12, 2025, 11:44 AM

వ్యాపారులు సిండికేట్‌ అయ్యారు. నగరపాలక సంస్థలో సంత, దినసరి మార్కెట్‌ రుసుము వసూలుచేసుకునే హక్కుకు సంబంధించి 2025-26 సంవత్సరానికి నిర్వహించిన వేలం అందుకు నిదర్శనంగా నిలిచింది. వాస్తవానికి ఈ నెల 4న వేలం నిర్వహించారు. అనంతపురం నగరానికి చెందిన విజయ్‌కుమార్‌, పామిడికి చెందిన అభిలాష్‌, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వెంకట రాజేం ద్రప్రసాద్‌ హాజరయ్యారు. ఆ సందర్భంలో రూ.88లక్షలతో వేలం ప్రారంభించగా... తమకు గిట్టుబాటు కావడం లేదని, ఆ మొత్తాన్ని తగ్గించాలని కోరారు. దీనిపై కమిషనర్‌ తుది నిర్ణయం తీసుకుంటారని వివరిస్తూ డిప్యూటీ కమిషనర్‌ వెం కటేశ్వర్లు వాయిదా వేశారు. మంగళవారం కమిషనర్‌ బాల స్వామి ఆర్వో విజయ్‌కుమార్‌తో కలిసి బహిరంగ వేలం పాట నిర్వహించారు. ఈ సారి విజయ్‌కుమార్‌, అభిలాష్‌ మాత్రమే వేలంలో పాల్గొన్నారు.


సిండికేట్‌ వ్యవహారం నేపథ్యంలోనే రాజేంద్రప్రసాద్‌ హాజరు కాలేదని తెలుస్తోంది. గత ఏడాది మార్కెట్‌ వేలం 87.90లక్షలకు దక్కించుకున్నారని చెబుతూ కమిషనర్‌ ఈ సారి సర్కారు వారి పాట రూ.88లక్షలతో ప్రా రంభిస్తామన్నారు. మరోసారి వేలందారులు అభ్యంతరం వ్య క్తం చేశారు. అందుకు నిరాకరిస్తూ కమిషనర్‌ వేలం ప్రారం భించారు. అభిలాష్‌ రూ.88.15లక్షలకు పాడాడు. ఇక ముం దుకు సాగలేదు. అభిలాష్‌ ఆ మొత్తానికి వేలం దక్కించు కున్నాడు. కాగా వేలంలో వారిద్దరికి అదనంగా మరో ఇద్దరు సహాయకారులమంటూ వేలంలో పాల్గొనడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com