ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేణుక ఎల్లమ్మ తల్లి దయతో ప్రజలంతా సంతోషంగా ఉండాలి

Bhakthi |  Suryaa Desk  | Published : Mon, Feb 17, 2025, 04:03 PM

గాజులరామారం చిత్తారమ్మ దేవి దేవాలయంలోని రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారి రజతోత్సవ వేడుకలకు బిఆర్ఎస్ పార్టీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... రేణుక ఎల్లమ్మ తల్లి దయ, కరుణాకటాక్షాలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలన్నారు. 
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు విజయ్ రాంరెడ్డి, సీనియర్ నాయకులు కస్తూరి బాలరాజ్, మూసా ఖాన్, తారా సింగ్, తెలంగాణ సాయి, సుంకరి చందు, విజయ్, శ్రీశైలం, ప్రసాద్, జగద్గిరిగుట్ట శ్రీ వేంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com