పీఎం ఇంటర్న్షిప్ రెండో విడతకు కేంద్రం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కొత్త నైపుణ్యాలు నేర్పించి, ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ స్కీమ్ లక్ష్యం. 300కు పైగా కంపెనీల్లో లక్షకు పైగా ఇంటర్న్షిప్ల కోసం మార్చి 12 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.5,000 చొప్పున 12 నెలల పాటు ఆర్థిక సహాయం అందిస్తారు. కంపెనీలో చేరే ముందు రూ.6,000 (వన్టైం గ్రాంట్) కూడా ఉంటుంది.
![]() |
![]() |