ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నదులకు 500 మీటర్ల దూరంలో ఆ అమ్మకాలు బంద్

national |  Suryaa Desk  | Published : Tue, Mar 11, 2025, 10:55 PM

సబ్బు, షాంపూ, సర్ఫ్‌నాలుగు రోజుల క్రితమే కర్ణాటక ప్రభుత్వం అన్ని థియేటర్లలోనూ 200 రూపాయలే సినిమా టికెట్లు అందజేయాలంటూ షాకింగ్ నిర్ణయం తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఎవరూ ఊహించని మరో నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నదుల వద్ద సబ్బులు, షాంపూలు, సర్ఫ్‌ల అమ్మకాన్ని పూర్తిగా నిషేధించింది. దాదాపు 500 మీటర్ల దూరం వరకు ఈ అమ్మకాలు చేపట్టకూడదని రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ కండ్రే ఆదేశాలు జారీ చేశారు. అసలు కర్ణాటక సర్కారు ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది, దాని వెనుక ఉన్న కథేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


రూ.5, రూ.10 కే చిన్న చిన్న సబ్బుల అమ్మకాలు


కర్ణాటక రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ కండ్రే అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు. ప్రజలు యూజ్ అండ్ త్రో సంస్కృతి ఎక్కువగా ఉందని చెప్పారు. అందుకే దేవాలయాల వద్ద ఉన్న సరస్సులు, నదులు, చెరువుల వద్ద అనేక చిన్న దుకాణాలు పుట్టుకు వచ్చాయని తెలిపారు. 5 రూపాయలు, 10 రూపాయలకు చిన్న చిన్న సబ్బులు.. రూపాయి, రెండు రూపాయలకు షాంపూలు విక్రయిస్తున్నారని వివరించారు. భక్తులు కూడా దేవాలయాల వద్దకు వచ్చి పుణ్య స్నానాలు చేస్తున్న సమయంలో.. అక్కడే సబ్బులు, షాంపూలు, సర్ఫ్ పాకెట్లను కొనుగోలు చేస్తున్నారని అన్నారు.


నదులకు 500 మీటర్ల దూరంలో అమ్మకాలు బంద్


ఆ తర్వాత వాటిని ఉపయోగిస్తూ నదుల్లో స్నానాలు చేసి.. వాటిని అందులోనే పాడేస్తున్నారని మంత్రి ఈశ్వర్ కండ్రే వెల్లడించారు. వాటి వల్ల నదులు, సరస్సులు, ఇతర నీటి వనరులు కాలుష్యంగా మారిపోతున్నాయని వివరించారు. ఈక్రమంలోనే 500 మీటర్ల దూరంలో సబ్బులు, షాంపూ, కాలుష్యానికి కారణం అయ్యే ఇతర వస్తువుల విక్రయాలు చేపట్టకుండా చూడాలని.. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా భక్తులు స్నానాలు చేసిన తర్వాత తమ బట్టలను నదుల్లోనే పారేయకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.


బట్టలు కూడా నదుల్లో వేయకుండా చూడాలి..!


ఇప్పటి వరకు వేలాది మంది భక్తులు పుణ్య స్నానాలు చేసి నదుల్లోనే తమ బట్టలు పారేశారని.. ఫలితంగా అక్కడ కుప్పలు తెప్పలుగా బట్టలు జమ అయ్యాయని చెప్పారు. అందువల్లే నదులు, సరస్సులు, చెరువుల్లో భక్తులు స్నానాలు చేసిన తర్వాత తమ బట్టలను తిరిగి ఇంటికి తీసుకెళ్లాలని.. అధికారులు ఇందుకోసం గట్టి చర్యలు తీసుకోవాలని మరోసారి వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com