ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 01, 2025, 02:03 PM

డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తప్పుడు మెడికల్ రిపోర్ట్ ఇచ్చినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ పద్మావతి సీఐడీ విచారణకు హాజరుకావాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది. 7, 8 తేదీల్లో ఉదయం 10 గంటలకు విచారణాధికారి ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. విచారణకు సహకరించకపోతే మధ్యంతర రక్షణ రద్దు అవుతుందని హెచ్చరించింది. తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది.విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ... డాక్టర్ ప్రభావతి విచారణకు ఎలా సహకరించడం లేదో సాక్షాలతో సహా కోర్టు ముందు ఉంచారు. ఈ క్రమంలో జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ కె.విశ్వనాథమ్ ల ధర్మాసనం పద్మావతికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్ఆర్ఆర్ కస్టోడియల్ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పద్మావతి పిటిషన్ ను దాఖలు చేశారు. అయితే ఆమె విన్నపాన్ని హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో, ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఆమెకు సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పిస్తూ... విచారణకు హాజరుకావాలని సూచించింది. అయితే ఆమె విచారణకు హాజరుకావడం లేదని ఆమెకు గతంలో ఇచ్చిన మధ్యంతర రక్షణను తొలగించాలని ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు విచారణకు తప్పకుండా హాజరుకావాలని ఆదేశించింది. విచారణకు హాజరుకాకపోతే మధ్యంతర రక్షణను తొలగిస్తామని హెచ్చరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com