శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మున్సిపల్ ఛైర్పర్సన్ నజీమున్నీసాతో పాటు వైస్ ఛైర్మన్లు గంగాదేవి, రాజశేఖర్ రెడ్డిలపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఈ పరిణామంతో కదిరి మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ఖాతాలోకి చేరింది.కదిరి మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉండగా, అవిశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్కు 25 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. హాజరైన సభ్యులందరూ ఛైర్పర్సన్, వైస్ ఛైర్మన్లకు వ్యతిరేకంగా ఓటు వేయడంతో అవిశ్వాసం నెగ్గినట్లు అధికారులు ప్రకటించారు. కాగా, అధికార వైసీపీకి చెందిన 11 మంది కౌన్సిలర్లు ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఓటు అవసరం లేకుండానే కోరం ఉండటంతో తీర్మానం ఆమోదం పొందింది.గత కొంతకాలంగా ఛైర్పర్సన్ నజీమున్నీసాపై సొంత పార్టీ కౌన్సిలర్ల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోందని, అభివృద్ధి పనులు జరగడం లేదని, పరిపాలనలో పారదర్శకత లోపించిందని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే టీడీపీ మద్దతుతో కొందరు కౌన్సిలర్లు అవిశ్వాస నోటీసు ఇచ్చారు. తీర్మానం నెగ్గడంతో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు మున్సిపల్ కార్యాలయం వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నాయి.
![]() |
![]() |