ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పహల్గాం దాడికి వ్యతిరేకంగా వ్యక్తి హత్య.. ప్యాంట్లో కత్తులు, తుపాకులు దోపుకుని మరీ వీడియో

national |  Suryaa Desk  | Published : Sat, Apr 26, 2025, 08:00 PM

ఉత్తర ప్రదేశ్ ఆగ్రాకు చెందిన 31 ఏళ్ల వయసు కల్గిన గుల్ఫామ్ అలీ.. తాజ్‌గంజ్ ప్రాంతంలోని శిల్ప్‌గ్రామ్ రోడ్డులో షాహిద్ అలీ చికెన్ బిర్యానీ సెంటర్‌లో పని చేస్తున్నాడు. అయితే బుధవారం రోజు రాత్రి ఆ రెస్టారెంట్ మూసివేస్తుండగా.. కొందరు వచ్చి కాల్పులు జరిపి గుల్ఫామ్ అలీని హత్య చేశారు. అలాగే ఈ ఘటనలో సయ్యద్ అలీ మరో కార్మికుడు కూడా గాయపడ్డాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికీ నిందితులు ఎవరనేది ఇంకా తెలియలేదు.


ఇదిలా ఉండగానే.. "క్షత్రియ గోరక్షా దళ్" సభ్యులం అని చెప్పుకుంటూ ఓ ఇద్దరు వ్యక్తులు ఓ వీడియో చేశారు. అందులో షర్టులు వేసుకోకుండా.. ప్యాంట్లలో కత్తులు, తుపాకులు దోపుకుని కనిపించారు. గుల్ఫామ్ అలీని చంపింది తామేనని వివరించారు. అలాగే ఈ హత్య చేయడానికి కారణం.. పహల్గాంలో హిందువులపై దాడి జరగడమేనని వెల్లడించారు. ఆ ఉగ్రదాడికి ప్రతీకార చర్యగానే ఈ హత్యకు పాల్పడ్డామని చెబుతూ.. వాళ్లు 26 మందిని చంపగా మేము 2600 మందిని చంపుతామని.. లేకపోతే భరతమాత కుమారులమే కాదంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఆపై దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


అయితే ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ అయింది. ముఖ్యంగా ఉగ్రదాడికి ప్రతీకార చర్య అని చెప్పగా.. లక్షలాది మంది వీడియోను చూశారు. ఇలాగే ఈ వీడియో పోలీసుల కంట కూడా పడగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ముఖ్యంగా వీరిని అదుపులోకి తీసుకోగా.. వీరు పాపులర్ అవ్వడానికి ఈ వీడియో చేసినట్లు గుర్తించారు. అసుల ఆగ్రాలో "క్షత్రియ గోరక్షా దళ్" అనే సంస్థే లేదని వివరించారు. అలాగే గుల్ఫామ్ అలీని చంపింది కూడా వీళ్లు కాదని.. ఆహారం విషయంలో గొడవ జరిగి ఎవరో హత్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు.


గుల్ఫామ్ అలీ చనిపోయినప్పటికీ.. ఆయన తోటి కార్మికుడు సయ్యద్ అలీ కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతున్నట్లు పోలీసులు గుర్తు చేశారు. ముగ్గురు వ్యక్తులు స్కూటర్‌పై రాగా.. ఇద్దరు రెస్టారెంట్ వైపు నడుచుకుంటూ వెళ్లి కాల్పులకు పాల్పడ్డారని అతడు చెప్పినట్లు వివరించారు. ఆపబోతుంటే తనకు కూడా గాయాలయ్యాయని.. వారిని చూస్తే ఇట్టే గుర్తుపడతాడని చెప్పారు. అంతేకాకుండా ఈ వైరల్ వీడియో ఇప్పటికే చూపించగా.. వీళ్లు కాదని సయ్యద్ అలీ చెప్పినట్లు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com