ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్రం బిగ్ న్యూస్,,,జనాభా లెక్కల్లో కులగణన సర్వే కూడా

national |  Suryaa Desk  | Published : Wed, Apr 30, 2025, 10:14 PM

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో చేయబోయే జనాభా లెక్కింపులో కుల గణనను కూడా చేర్చాలని ఢిల్లీలో బుధవారం రోజు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన రాజకీయ వ్యవహారాల కేంద్ర కమిటీలో నిర్ణయించారు. ఈ విషయాన్ని నేరుగా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. త్వరలోనే జనాభా లెక్కలు జరగబోతున్నాయని.. అందులోనే కుల గణనను కూడా చేర్చబోతున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా కుల గణను పేరుతో కాంగ్రెస్ సర్వే చేయించిందని.. అందులో ఏమాత్రం పారదర్శకత లేదని పేర్కొంది. ఈరోజు కేంద్ర కాబినేట్‌లో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన పూర్తి వివరాలను వివరించారు.


జనాభా లెక్కల్లో కులగణన


బుధవారం రోజు ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన రాజకీయ వ్యవహారాల కేంద్ర కమిటీ భేటీ నిర్వహించింది. ఈ సమావేశం అనంతరం కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన వివరాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. 2010లో నాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కుల గణన అంశాన్ని పరిశీలించాలని చెప్పారని గుర్తు చేశారు. ఈక్రమంలోనే నేటీ భేటీలో కుల గణనను జాతీయ జనాభా లెక్కల్లో చేర్చాలని నిర్ణయించినట్లు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడూ.. కుల గణనను వ్యతిరేకించాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. అలాగే చాలా రాజకీయ పార్టీలు కుల గణనను సిఫార్సు చేశాయన్నారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ కోణంలో కుల సర్వేలు చేశాయని విమర్శించారు.


కాంగ్రెస్ చేసిన సర్వేలో పారదర్శకత లేదు..


కాంగ్రెస్ పాలిత తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో జరిగిన సర్వేలను ఉద్దేశించి మాట్లాడుతూ.. కాంగ్రెస్, దాని INDIA కూటమిలు కుల గణనను రాజకీయ సాధనంగా ఉపయోగించాయని ఆరోపించారు. కొన్ని రాష్ట్రాలు కులాల జాబితాను బాగానే తయారు చేశాయని.. కానీ మరికొన్ని రాష్ట్రాలు రాజకీయ కారణాల వల్ల సరిగా చేయలేదని పేర్కొన్నారు. ఇలాంటి సర్వేల వల్ల ప్రజల్లో అనుమానాలు వస్తాయన్నారు. రాజకీయాల వల్ల సమాజంలో గందరగోళం ఏర్పడకుండా ఉండాలంటే సర్వేల బదులు జనాభా లెక్కల్లో కులాల వివరాలు సేకరించాలి అని మంత్రి అన్నారు.


కులగణన వల్ల కులాల మధ్య సమానత్వం..


జనాభా లెక్కల్లో కులాల వివరాలు సేకరించడం వల్ల చాలా ఉపయోగం ఉంటుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఏ కులంలో ఎంత మంది ఉన్నారో తెలుస్తుందన్నారు. దీనివల్ల ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతాయన్నారు. కులాల మధ్య సమానత్వం కూడా వస్తుందని స్పష్టం చేశారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com