ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తండ్రైన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 12, 2025, 07:55 PM

కింజరాపు ఫ్యామిలోకి వారసుడొచ్చాడు.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తండ్రయ్యారు. రామ్మోహన్ నాయుడు, శ్రావ్య దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించాడు. ఇవాళ శ్రావ్య ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. రామ్మోహన్ నాయుడికి తొలి సంతానంగా పాప ఉన్నారు.. రెండో సంతనంగా బాబు పుట్టాడు. తల్లీ,బిడ్డా క్షేమంగా ఉన్నారంటూ అభిమానులకి తెలియజేసిన కింజరాపు ఫ్యామిలీ. కింజరాపు ఫ్యామిలోకి వారసుడు రావడంతో ఎర్రన్నాయుడు మళ్లీ పుట్టారంటూ కింజరాపు కుటుంబ అభిమానులు సంతోషంలో ఉన్నారు. రామ్మోహన్ నాయుడికి తోటి కేంద్రమంత్రులు, ఎంపీలు విషెస్ తెలిపారు. రామ్మోహన్ నాయుడు సతీమణి శ్రావ్య మాజీ మంత్రి, ప్రస్తుత మాడుగుల టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కుమార్తె. రామ్మోహన్ నాయుడు, శ్రావ్యల వివాహం 2017లో జరిగింది.


రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో డిసెంబరు 18 1987 న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు విజయలక్ష్మి , దివంగత కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడు. రామ్మోహన్ నాయుడు ఒకటి నుంచి మూడో తరగతి దాకా శ్రీకాకుళంలో చదివారు. 1994 నుంచి హైదరాబాద్‌ భారతీయ విద్యాభవన్ లో నాలుగు, ఐదు తరగతులు చదివారు. 1996 నుంచి రామ్మోహన్ ఢిల్లీలో ఆర్. కె. పురం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివారు.. అక్కడే ఇంటర్ పూర్తి చేసిన తర్వాత అమెరికాలో బీఎస్ కోసం పరీక్ష రాసి అక్కడి పర్డ్యూ యూనివర్శిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్.. అక్కడ లాంగ్ ఐలాండ్ వర్శిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ఆ తర్వాత తండ్రి మరణంతో రాజకీయాల్లోకి వచ్చారు.


రామ్మోహన్ నాయుడు 2014,2019, 2024 ఎన్నికల్లో వరుసగా టీడీపీ తరఫు ఎంపీగా గెలిచారు. ఆయన లోక్‌సభలో హోమ్‌ అఫైర్స్ స్టాండింగ్ కమిటీ,అధికార భాష , వెనుకబడినతరగతుల సంక్షేమం, కన్సల్టేటివ్ కమిటీ, పర్యాటక , సంస్కృతి మంత్రిత్వ శాఖ కమిటీలలో సభ్యులుగా పనిచేశారు. 2024 ఎన్నికల్లో మూడోసారి శ్రీకాకుళం ఎంపీగా గెలిచి ఏకంగా కేందమ్రంత్రి వర్గంలో పౌర విమానయాన శాఖ మంత్రి అయ్యారు. ఆయన తెలుగు రాష్ట్రాల్లో అత్యంత చిన్న వయసులో కేంద్ర మంత్రి పదవి పొందిన వ్యక్తిగా ఉన్నారు.


ప్రధానిని కలిసిన కేంద్రమంత్రులు, ఎంపీలు


మరోవైపు సోమవారం రోజు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఇతర టీడీపీ ఎంపీలు ప్రధాని మోదీని కలిశారు. విశాఖలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం కావడం పట్ల మోదీ సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కేంద్రం సహకారం కొనసాగించాలని ఎంపీలు కోరారు. ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతం చేసినందుకు ఎంపీలు ప్రధానిని అభినందించారు. ట్రంప్ సుంకాలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయంలో కేంద్రానికి అండగా ఉంటామని ఎంపీలు తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతం చేసినందుకు ఎంపీలు మోదీని అభినందించారు. ట్రంప్ సుంకాలను గురించి కూడా చర్చించారు. దీని వల్ల రాష్ట్రంపై పడుతున్న ప్రభావం గురించి ప్రధానికి వివరించారు. ఈ వ్యవహారంలో కేంద్రం చేస్తున్న పోరాటానికి తాము మద్దతు ఇస్తామని ఎంపీలు హామీ ఇచ్చారు.


రాష్ట్రం నుంచి జరిగే ఆక్వా, చేపల ఎగుమతులు, మిర్చి, ఇతర ఆహార పదార్థాల ఎగుమతులపై ప్రభావం పడుతుందని ఎంపీలు ప్రధాని మోదీకి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ఎంపీలు ఎలా విజయవంతం చేశారో పుస్తకాల రూపంలో టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయులు ప్రధానికి అందజేశారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ అప్పలనాయుడిని మోదీకి పరిచయం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa