ధర్మస్థలంలో జరిగిన అనుమానాస్పద ఖననాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిర్వహిస్తున్న విచారణలో నూతన మలుపు వచ్చింది. శనివారం, విచారణను తప్పుదోవ పట్టించేలా తప్పుడు సమాచారం ఇచ్చిన విజిల్బ్లోయర్ను అధికారులు అరెస్టు చేశారు. అతను చెబుతున్న వివరాలు పూర్తిగా నిర్ధారణలేమైనవిగా తేలినట్టు సిట్ పేర్కొంది.
1995 నుండి 2014 మధ్య ధర్మస్థలంలో శానిటరీ వర్కర్గా పనిచేసినట్టు పేర్కొన్న నిందితుడు, అక్కడ హత్యలు, లైంగిక వేధింపుల బాధితుల మృతదేహాలను బలవంతంగా తానే ఖననం చేశానని జూలై 3న ఫిర్యాదు చేశాడు. ఈ ఆరోపణలు ఒకటై సంచలనంగా మారాయి.
అయితే, అతని వివరాలను సమగ్రంగా విచారించిన అనంతరం అవి పూర్తిగా కల్పితమైనవని సిట్ దర్యాప్తులో తేలింది. అనేక ప్రాంతాల్లో తవ్వకాలు, సాక్ష్యాలు, ప్రత్యక్ష నిఘా ఆధారంగా ఆయన చెప్పిన వాంగ్మూలంలో నిజం లేదని నిర్ధారణకు వచ్చారు.
దర్యాప్తును గందరగోళానికి గురిచేయడమే కాక, అధికార వనరుల వృథా అయ్యేలా చేసినందుకు అతనిపై అసత్యపు సాక్ష్యం ఇచ్చిన కేసు నమోదు చేసి శనివారం అధికారికంగా అరెస్టు చేశారు. ప్రస్తుతం అతనిపై తదుపరి విచారణ కొనసాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa