భారత వాతావరణ శాఖ (IMD) సమాచారం ప్రకారం, వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల సమీపంలో ఈ సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.దీని ప్రభావంగా వచ్చే మూడు రోజులు ఉత్తరాంధ్ర ప్రాంతంలో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మిగతా జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో ఈదురు గాలులు వీచే సూచనలు ఉన్నాయని హెచ్చరించారు.ఈ నేపథ్యంలో, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. భారీ వర్షాల వల్ల ప్రమాదం నెలకొనవచ్చందున ప్రజలు చెట్ల కింద, పాత భవనాలు, బోర్డులు (హోర్డింగ్స్) వద్ద నిలవకూడదని హెచ్చరించారు. నీటమునిగే ప్రాంతాల్లో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, వంకలు పొంగిపొర్లినప్పుడు వాటిని దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు.ప్రత్యేకంగా, సోమవారం రోజున శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం మాత్రం అదే జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa