ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరాఠా ఉద్యమకారులపై కేసులు ఎత్తేయండి : ఉద్ధవ్‌ థాక్రే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 12, 2018, 10:59 AM

ముంబై :  మరాఠా ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ థాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థలలో రిజర్వేషన్లు కోరుతూ మరాఠాలు ఉద్యమించినప్పుడు కొంతమంది దుండగులు ఉద్యమంలోకి ప్రవేశించి హింసాకాండకు పాల్పడ్డారని ఆయన అన్నారు. మరాఠా యువతపై పెట్టిన కేసులను ఉపసంహరించడానికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, ముఖ్యమంత్రి తన మాట నిలబెట్టుకోవాలని థాక్రే అన్నారు. శివసేన మరాఠాలకు మద్దతుగా నిలుస్తుందని ఆయన చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa